నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ తో అదిరిపోయే విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ తో  భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. 

అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడం,  క్రాక్ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం వలన ఈ సినిమాపై మొదటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ చిత్ర బృందం విడుదల చేయగా, ఆ టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం,  బాలకృష్ణ మాస్ యాక్షన్ సన్నివేశాలు,  అదిరిపోయే డైలాగ్ లతో ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో ఈ మూవీ లో కనిపించబోతుంది. 

మూవీ లో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  ఈ సినిమా లోని ఇంటర్వెల్ సన్నివేశం దగ్గర బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఓపెన్ అవుతాయి అని, సినిమా మొత్తానికి ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలెట్ గా ఉండబోతుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: