మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో  గ్రాండ్ సక్సెస్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

సినిమా రామ్ చరణ్ కు కెరియర్ పరంగా 15 వ సినిమా కావడంతో ఈ సినిమా ప్రస్తుతం ఆర్ సి 15 అనే టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరున హైదరాబాద్ లో ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో కియారా అద్వానీ , రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా,  అంజలి , సునీల్మూవీ లో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే దర్శకుడు మరియు నటుడు అయిన ఎస్ జే సూర్య కూడా ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఒక ప్రత్యేక సాంగ్ లో కనిపించబోతున్నట్లు,  ఈ సాంగ్ పొలిటికల్ సెటైరికల్ సాంగ్ గా చిత్ర బృందం చిత్రీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజమో చూడాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు సమాచారం.  ఒక పాత్రలో పల్లెటూరు వ్యక్తిగా రామ్ చరణ్ కనిపించనుండగా, మరొక పాత్రలో స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: