నందమూరి నట సింహం బాలకృష్ణ వరుసగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ వంటి అపజయాల తర్వాత అఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా , శ్రీకాంత్మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, పూర్ణ ఒక కీలక పాత్రలో నటించింది. అఖండ సినిమా డిసెంబర్ 2 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది. అఖండ మూవీ తో బాలకృష్ణ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఏకంగా 100 కోట్ల కు పైగా  కలెక్షన్ లను  బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టి కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇలా అఖండ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ , శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో 107 వ మూవీ గా తెరకెక్కుతోంది. దానితో ఇప్పటి వరకు ఈ మూవీ కి టైటిల్ ను చిత్ర బృందం ఫిక్స్ చేయకపోవడం తో ఈ సినిమా చిత్రీకరణ ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుకుంటుంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయగా,  ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా విడుదల విషయంలో మూవీ యూనిట్ ఒక తేదీ కి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అఖండ డిసెంబర్ 2 వ తేదీన విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో , అదే తేదీన ఎన్ బి కే 107 మూవీ ని కూడా విడుదల చేయాలని మూవీ యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: