శివాత్మిక రాజశేఖర్.. యాంగ్రీ మాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ శివాత్మిక రాజశేఖర్ కు మాత్రం నటిగా మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే వరుస సినిమాలలో నటించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా శివాత్మిక కొన్ని ఫోటోలను సోషల్ మీడియాతో షేర్ చేసుకోవడం జరిగింది.
ఇకపోతే ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక నెటిజన్ మాత్రం శివాత్మిక రాజశేఖర్ ఫోటోలు చూసి మేడం మీరు అచ్చం దేవతలా ఉన్నారు అంటూ కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఆ పిక్స్ కాస్తా బాగా వైరల్ అవుతున్నాయి. కాస్త ఎక్స్పోజింగ్కి దూరంగా ఉంటూ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం శివాత్మిక కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ లీడ్రోల్ పోషిస్తున్న రంగమార్థాండ  సినిమాలో నటిస్తోంది.ఇదిలా ఉండగా గతంలో తను ఎదుర్కొన్న రూమర్స్ ని కూడా వెల్లడించి ఎమోషనల్ అయింది శివాత్మిక . ఈమె ఎవరితోనో వెళ్ళిపోయింది అనే వార్త సోషల్ మీడియాలో బాగా హాల్చల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తన ప్రియుడితో దుబాయ్ వెళ్లినట్లు వార్తలు అయ్యాయి. ఇక ఈ విషయంపై స్వయంగా శివాత్మిక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను ఎవరితోనూ వెళ్ళిపోలేదని ఇక తన తల్లిదండ్రులతోనే దుబాయ్ వచ్చాను అంటూ అందుకు సంబంధించిన ఒక ఫోటోను కూడా పంచుకుంది. ఇకపోతే ఏదైనా రూమర్ క్రియేట్ చేసాము అంటే అందులో కొంతైనా నిజం ఉండాలి అని.. పూర్తిగా నమ్మసక్యంగా లేని రూమర్స్ ఎందుకు స్ప్రెడ్ చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తన తల్లి జీవిత రాజశేఖర్ కు జిరాక్స్ కాపీలా ఉండే శివాత్మిక ఫోటోలు మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: