రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆది పురుష్  సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మూవీ తో పాటు ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే , సలార్ మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండూ మూవీ లు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. సలార్ మూవీ కి 'కే జి ఎఫ్' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపును ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ,  ప్రాజెక్ట్ కే మూవీ కి 'మహానటి' మూవీ తో ఎంతో మంది ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలను అందుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే మరియు సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో మళ్ళీ ప్రభాస్ జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే  సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

తాజా షెడ్యూల్ లో ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే కూడా పాల్గొన్న పోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సభ్యులపై కీలక సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ , దిశా పటానిమూవీ లో ముఖ్య పాత్రలను పోషిస్తూ ఉండగా,  మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: