టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ వున్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు ఆయన విక్టరీ వెంకటేష్ కొన్ని రోజుల క్రితమే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇలా ఎఫ్ 3  మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న విక్టరీ వెంకటేష్ తన అన్న కొడుకు అయిన రానా తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు .

మరి కొన్ని రోజుల్లోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది . అలాగే హిందీ లో కూడా సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న  ఓ మూవీ లో వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తనతో ఇప్పటికే రెండు మూవీ లను తెరకెక్కించిన దర్శకుడి దర్శకత్వంలో ముచ్చటగా మూడో సారి నటించనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... కొత్త బంగారు లోకం మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్  నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వెంకటేష్ , శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , నారప్ప మూవీ లు తెరకెక్కాయి. ఈ రెండు మూవీ లు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముచ్చటగా మూడో సారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో  సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల , విక్టరీ వెంకటేష్ తో ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథను తెరకెక్కించబోతున్నాట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: