తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే  రోజా 1990 నుండి 2000 సంవత్సరం వరకు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈమె తెలుగులో ఉన్న అందరి స్టార్ హీరోలతో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.హీరోయిన్ గా తన కెరీర్ కు స్వస్తి పలికిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిందే తప్ప ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి దూరం కాలేదు. ఇకపోతే ఆ తర్వాత రోజుల్లో జబర్దస్త్ వంటి కామెడీ షో కి జడ్జ్ గా వ్యవహరించిన తర్వాత ఈమె కెరియర్ పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు.

 అయితే  అప్పటికే అప్పుల ఊబి లో కూరుకుపోయిన రోజాకు అటు వైసిపి పార్టీ ఇటు జబర్దస్త్ కామెడీ షో రెండు కూడా మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.అయితే ఇక నిజానికి సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఈమె ఆస్తి మొత్తం పోగొట్టుకొని ఇబ్బందుల్లో ఉండగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా మళ్ళీ తన ఆస్తిని నిలబెట్టుకుంది. ఇకపోతే ఎన్నో సంవత్సరాల పాటు ఈ షోలో జడ్జిగా వ్యవహరించి.. ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండి మొదట ఎమ్మెల్యే అయి ఆ తర్వాత మంత్రిగా కూడా కొనసాగుతోంది.అయితే  మంత్రిగా పదవి వచ్చిన తర్వాత జబర్దస్త్ కి ఆమె గుడ్ బాయ్ చెప్పి ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ గా ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది.

ఇదిలావుండగా ఈ క్రమంలోనే రోజా భారీగా ఆస్తులు కూడ పెట్టింది అనే వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే కానీ రోజా ఆస్తులు విలువ తెలిస్తే మాత్రము అంతేనా అని అనుకమానరు. పోతే ఆమె దాదాపుగా రూ.7కోట్ల 38 లక్షల రూపాయలు మాత్రమే పోగు చేసిందని, స్థిరాస్తుల విలువ రూ.4 కోట్ల 64 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని, చరాస్తులు రూ.2కోట్ల 74 లక్షలు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఇదిలావుండగా ఇక పిల్లల పేరిట ఇద్దరికీ చెరొక రూ. 50 లక్షల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసిందట. అయితే ఇక ఇదంతా నిజమేనా అని మాత్రం ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: