టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ లలో ఒకరు అయిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అనుష్క శెట్టి ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా తనకంటూ ఒక అదిరిపోయే ఇమేజ్ ను సొంతం చేసుకుంది .

అనుష్క , నాగార్జున హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది . మొదటి మూవీ లోనే అటు హాట్ హాట్ అందాలతో , ఇటు అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించింది . ఆ తర్వాత ఎన్నో కమర్షియల్ మూవీ లలో నటించి సూపర్ హిట్ లను అందుకున్న అనుష్క 'అరుంధతి' మూవీ లోని నటనతో  ఎంతో మంది ప్రేక్షకుల , విమర్శకు ల ప్రశంసలు అందుకొని గొప్ప నటిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది . ఇది ఇలా ఉంటే బాహుబలి మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న అనుష్క  చివరగా నిశ్శబ్దం  మూవీ తో  ప్రేక్షకులను పలకరించింది .

మూవీ తో అనుష్క ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది . ఇది ఇలా ఉంటే తాజాగా అనుష్క ఒక తమిళ క్రేజీ దర్శకుడి మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది . తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుల లో ఒకరు అయిన ఏ ఎల్ విజయ్ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో అనుష్క నటించ బోతున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ సంస్థ నిర్మించ బోతున్నట్లు సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి: