కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్  హీరోగా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా బ్యానర్లపై..నిర్మాతలు దిల్ రాజు , శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. ఈ సినిమాలో హీరో విజయ్ సరసన నేషనల్ క్రష్ కన్నడ బ్యూటీ రష్మికా మందన్న హీరోయిన్‪గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇక ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా తెలియంది కాదు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పెద్ద స్టార్ హీరోని.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడనే వార్త వచ్చినప్పుడే.. ఈ సినిమాపై భారీగా ఎన్నో అంచనాలు మొదలయ్యాయి. అందులోనూ దిల్ రాజు వంటి స్టార్ నిర్మాత కావడంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ మాములుగా ఏర్పడలేదు.


అంతేగాక ఈ ప్రాజెక్ట్ లోకి యాడ్ అవుతున్న తారాగణం చూస్తుంటే.. ఈ సినిమాపై అంచనాలు అనేవి రెట్టింపవుతున్నాయి.టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భారీ తారాగణమే కాకుండా.. ఇంకా అలాగే అత్యున్నత సాంకేతిక నిపుణులు కూడా సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో అని ఫ్యాన్స్ అనుకుంటూ వున్నారు. ఇటీవల వల ఈ సినిమా పోస్టర్ బట్టి చూస్తే విజయ్ ఇందులో సీఈఓ గా కనిపిస్తాడేమో అని అంతా భావించారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం విజయ్ ఇందులో యాప్ డెవలపర్ గా నటిస్తున్నాడని సమాచారం తెలుస్తుంది.యాప్ డెవలపర్ నుంచి సీఈఓ గా విజయ్ ఎలా ఎదిగాడు అనే దానిపై ఈ సినిమా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాకి వారసుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: