యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ మలయాళ సినిమా పట్టం పోలే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది . ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పేట మూవీ లో మాళవికా మోహనన్ కీలక పాత్రలో నటించింది .

సినిమా ద్వారా ఈ ముద్దు గుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది . పేట సినిమా ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్న మాళవికా మోహనన్ ఆ తర్వాత తళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ మూవీ లో కథానాయికగా నటించింది . ఈ సినిమా ద్వారా ఈ ముద్దు గుమ్మ తమిళ తో పాటు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకుంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ ఒక క్రేజీ తెలుగు మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది . రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా మాళవికా మోహనన్ మూవీ యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజం అయితే మాళవికా మోహనన్ అదిరిపోయే మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్టే అవుతుంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ అక్టోబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు మారుతిసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: