టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఛార్మింగ్ కపుల్ గా అందరి దృష్టిని ఆకర్షించిన నాగచైతన్య సమంతలు ఎందుకు విడిపోయారో ఎవరికీ తెలియని విషయం. ఇండస్ట్రీలోని అందరు వీరిద్దరూ విడిపోయినందుకు బాధపడ్డవాళ్ళే. ఈవిషయం పై సీనియర్ హీరో మురళీ మోహన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.  

 

 చైతూ సామ్ తన ఇంట్లోనే ఉండేవారు అన్నవిషయాన్ని వివరిస్తూ ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు.  తనకు ‘హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిట్ లో తనకు కొన్ని అపార్ట్‌మెంట్లు ఉన్నాయని అయితే అవి కేవలం తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని కట్టించుకున్న ఇళ్లు అన్నవిషయం బయటపెట్టాడు.

 

 అప్పట్లో ఒకసారి చైతూ సమంతలు తమకు పెళ్ళి అయిన కొత్తలో తాను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న హౌస్ ల విషయం తెలుసుకుని వారిద్దరూ తన వద్దకు వచ్చి తమకు ఆఇల్లు కావాలి అని అడిగారని అయితే తాను ఆ ఇల్లు తన కుటుంబం కోసం కట్టుకున్న ఇల్లు కావడంతో తాను అమ్మను అని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఆతరువాత నాగార్జున తనకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడంతో నాగ్ మాట కాదనలేక తాను ఆ ఇంటిని సమంత చైతూ లకు ఇవ్వవలసి వచ్చింది అని చెప్పాడు.

 

 పెళ్లయ్యాక వారిద్దరూ విడిపోయే వరకు వారిద్దరూ ఆఇంటిలోనే ఉన్న విషయాన్ని బయటపెడుతూ వారు తన ఇంటిలో ఉన్నన్ని రోజులు ఎప్పుడూ వాళ్లు గొడవపడడం చూడలేదు. తిట్టుకోవడం వాగ్వాదాలు జరిగిన ఘటనలు కూడా తన దృష్టికి రాలేదు అని అంటున్నాడు. అంతేకాదు ఫ్రెండ్స్ వీకెండ్ పార్టీలు లాంటివేమీ ఆ ఇంట్లో ఉండేవికావని ఎప్పుడూ ఇల్లు ప్రశాంతంగా ఉండేది అని అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే వారిద్దరు విడాకులు తీసుకున్న విషయం చాల ఆలస్యంగా తెలిసిందని ఆవిషయాలు తనకు ముందుగా తెలిసి ఉంటే వారిద్దరితో మాట్లాడి వారు విడాకులు తీసుకోకుండా తనవంతు ప్రయత్నాలు గట్టిగా చేసి ఉండేవాడినని మురళీ మోహన్ ఇప్పుడు బాధ పడుతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: