స్వయంగా ట్విట్టర్ వేదికగా వర్మ ఈ విషయాన్ని తెలిపాడు. కరోనా సమయంలో దేశం లో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ వరుస ట్వీట్స్ చేశాడు. ఈ సందర్భంగా వర్మ ట్వీట్ చేస్తూ.. 'కొవిడ్ సెకండ్ వేవ్ వెనుక ఉన్న కుట్రదారు కరోనా వైరస్ కాదు. అధికార యంత్రంగం లో ఉన్న నిర్లక్ష్యం. దీనిని 'కొవిడ్ ఫైల్స్' నిరూపిస్తుంది. లక్షలాది ప్రాణం కోల్పోవడానికి కారణమైన అవినీతి, నిర్లక్ష్య యంత్రాంగాన్ని ఈ సినిమా బట్టయలు చేయనుంది.
ఈ సినిమా లో చూపించే నిజాలు ఓటర్ల లో ఆగ్రహం తెప్పిస్తుంది. వచ్చే ఎన్నికాల్లో ప్రభావం చూపిస్తుంది' అని రాసుకొచ్చారు. దీంతో వర్మ పెద్ద కాంట్రవర్సినే నెత్తికెక్కించుకున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమా లో ఎవరు నటిస్తారు.? ఎప్పుడు సెట్స్పైకి వెళుతుంది.?లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్ని సినిమాలు తీసినా కూడా ఆ సినిమాలు అవి ఒక్కటి కూడా వీడుదల కావడం లేదు.వర్మ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పుడు వర్మ ప్రభుత్వం తోనె పెట్టుకుంటున్నాడు.. మరి ఆ సినిమా ఎంత వరకూ వివాదలను తెస్తుందో చూడాలి..