పవన్ సన్నిహితుడైన త్రివిక్రమ్ కూడా ఈ కథలో నెగిటివిటీ తగినట్లుగానే కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. హరిహర వీరమల్లు ,భగవదియుడు భగత్ సింగ్ కాదని ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ డేట్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా వినిపిస్తున్న ప్రకారం వినోదయ సితమ్ సినిమాని అనుకున్న విధంగా షూటింగ్ మొదలు పెట్టలేకపోయారు అందుకు కారణం పవన్ కళ్యాణ్ సెట్స్ పైకి ఎప్పుడు వస్తారనే విషయం ఇంకా క్లారిటీగా రాలేదు అందుచేతనే షూటింగ్ అప్డేట్ పై దర్శకనిర్మాతలకు కూడా కాస్త క్లారిటీ లేదని సమాచారం.
అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల కొన్ని రోజులుగా రాజకీయ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే తను అస్వస్థకు కూడా గురైనట్లు తెలుస్తోంది. మరొకవైపు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో కూడా సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో సముద్రఖనితో సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియక సాయి ధరంతే సముద్రఖని ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక గత ఏడాది సాయి ధరంతే బైక్ యాక్సిడెంట్ కి గురికావడంతో కాస్త విరామం తీసుకుని తాజాగా సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సినిమాలో నటిస్తున్నారు. కానీ తన మేనమామకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి.. ఈ థ్రిల్లర్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడని టాక్ వినిపిస్తున్నది. దీంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న పలు సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి ఇలా వీరందరిని చాలా ఇబ్బందికి కారణం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.