మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోలలో మెగా మేనల్లుడు సాయి ధరమ్  గురించి తెలిసిందే. ఇక చివరగా సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ అనే సినిమాలో నటించాడు.అయితే ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ప్రేక్షకులకు తెగ నచ్చింది. ఇకపోతే  ఈ సినిమా విడుదలకు ముందు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. అయితే దాంతో చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటే రెస్ట్ తీసుకున్న తేజ్ రికవరీ అయ్యాక సినిమా షూటింగ్స్ లో తిరిగి పాల్గొంటున్నాడు.ఇదిలావుంటే ప్రస్తుతం సాయి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. 

ఇక కోలీవుడ్ హిట్ మూవీ వినోదయ సీతం రీమేక్‌లో తన మేనమామ పవన్ కళ్యాణ్‌తో కలిసి మరీ నటిస్తున్నాడు. అయితే ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ అప్పట్లో ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి.ఇకపోతే  ఆ హీరోయిన్ మరెవరో కాదు తేజ్ మొదటి సినిమా పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో హీరోయిన్ గా నటించిన రెజీనానే. కాగా ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ రెజీనా మధ్య స్నేహం పెరిగిందన్నది వాస్తవం.ఇదిలా వుండగా ఈ సినిమా వచ్చాక సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరి ఫోటోలకు ఒకరు కామెంట్లు పెట్టుకోవడం లాంటివి చేసేవారు. ఇంటర్వ్యూలలో కూడా ఎక్కువ సరదాగా కనిపించడం లాంటివి చేసేవారు.

ఇకపోతే  మరోవైపు పిల్లా నువ్వు లేని జీవితం సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో నటించారు. ఇక ఆ తర్వాత వీరిద్దరూ రిలేషన్‌షిఫ్‌లో ఉన్నారు అంటూ వార్తలు ఎక్కువయ్యాయి.అయితే రెజీనా స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వకపోవడానికి కూడా సాయి ధరంతేజ్ తో ఉన్న రిలేషన్ షిప్ కారణమని..లేని పోని ఎఫైర్లతో కెరీర్ నాశనం చేసుకుందని వార్తలు వినిపించాయి.  ఓ మీడియా సమావేశంలో సాయిధరమ్ తేజ్ ను. అయితే రెజీనా కెరీర్ అటకెక్కడానికి ఓ స్టార్ హీరోతో ఉన్న రిలేషన్ షిప్ కారణమా ? అంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. ఇక దాంతో సాయి ధరమ్ తేజ్ కాస్త సీరియస్ అయినట్టు కనిపించింది.ఇదిలా ఉంచితే ఆమె గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు.? ఇక  అది ఆమె పర్సనల్ లైఫ్ అంటూ స్పందించారు.అంతేకాదు  మీ కో స్టార్ కదా ? అంటూ మీడియా ప్రతినిధి మరోసారి ప్రశ్నించగా.. కోస్టార్ అయితే ఆమె పర్సనల్ లైఫ్ గురించి నేను ఎందుకు  మాట్లాడతాను అంటూ సమాధానం ఇచ్చారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: