ఇక తాజాగా ఈ సినిమాకు జాతీ అవార్డుల సత్తా చాటింది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించిన సూర్య హీరోయిన్ అపర్ణ బాలమురళి కి అవార్డు లభించాయి. ఇక ఈ సినిమాకు సూర్య నటుడుగా అవార్డు లభించింది అయితే అవార్డు కేవలం ఒక్కరికే కాకుండా ఇద్దరికీ వచ్చింది సూర్య తో పాటు అజయ్ దేవగన్ నటించిన తనాజీ సినిమాకి కూడా రావడం గమనార్హం. ఈ సినిమా మొత్తం ఐదు కేటగిరీల అవార్డుల సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో సూర్య ఉత్తమ నటుడుగా, అపర్ణ బాలమురళి ఎంపిక అయింది.
దీంతో ఈ సినిమాకి అవార్డు రావడంతో సూర్య చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ క్రమంలోనే తన ఇన్ స్టాగ్రామ్ నుంచి ఒక స్పెషల్ పోస్టును కూడా షేర్ చేశారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అవార్డు గెలుచుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఇక తనతో పాటు అవార్డు అందుకోబోతున్న అజయ్ దేవగన్ కు సైతం సూర్య అభినందనలు తెలియజేశారు. సురూరైపోట్రు సినిమాలో భాగమైనందుకు తన భార్యకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది సూర్య తన చిత్రాలను తనకు ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక నోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ నాట్ వైరల్ గా మారుతోంది.