మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం మార్చి 25 వ తేదీన విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది.

మూవీ ని దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా , ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కియారా అద్వానీమూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా , ఎస్ జే సూర్యమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ లో మరి కొన్ని ముఖ్యమైన పాత్రల్లో సునీల్ , అంజలి కనిపించబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ వున్న రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా పూర్తి కాగానే రామ్ చరణ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఈ సినిమాను యూ వి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతోంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా ఇప్పటికే లైన్ లో పెట్టాడు. విక్రమ్ మూవీ తో దేశ వ్యాప్తంగా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో రామ్ చరణ్ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు లోకేష్ కనకరాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.  రామ్ చరణ్ ఇలా ప్రస్తుతం అదిరిపోయే సినిమాల లైనప్ ని సెట్ చేసి పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: