సౌత్ ఇండియా సినిమా డామినేషన్ తో కకావికలమవుతున్న బాలీవుడ్ కు భారీ సినిమాలు అనేవి అసలు బొత్తిగా కలిసి రావడం లేదు. ఫస్ట్ రోజు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సెకండ్ డేకి తేలిపోతున్నాయి. ఇక పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇంకా కెజిఎఫ్ లాంటివి తామూ తీయాలనే తాపత్రయంతో బొత్తిగా కథా కథనాలు చూసుకోకుండా వందల కోట్ల బడ్జెట్లు పెట్టి చాలా గ్రాండియర్లు తీస్తున్నారు.బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ సైతం ఈ ట్రాప్ లో పడి డిజాస్టర్లు కొని తెచ్చుకోవడం గమనార్హం. ఆ మధ్య సామ్రాట్ పృథ్విరాజ్ సినిమా కూడా ఎంత దారుణంగా దెబ్బేసిందో బాక్సాఫీస్ ఇంకా మర్చిపోలేదు. ఇంకా అలాగే ఈలోగా మరొకటి వచ్చి పడింది. ఇక అదే షంషేరా. నిన్న హిందీతో పాటు తెలుగు తమిళం కన్నడ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమాని విడుదల చేశారు.రన్బీర్ కపూర్ నటన ఒక్కటే షంషేరా సినిమాలో చెప్పుకోవాల్సిన పాజిటివ్ అంశం.ఆ అంశంతో ఫస్ట్ షో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సాయంత్రం షో నాటికి తేలిపోయింది.


బాహుబలి సినిమాని తిప్పి రాసుకుని నానా ఖంగాళీ కథా కథనాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాడు ఈ సినిమా దర్శకుడు కరణ్ మల్హోత్రా. అయితే విజువల్స్ అద్భుతంగా వున్నాయి.కానీ ఈ అద్భుతమైన విజువల్స్, కోట్ల రూపాయల ఖర్చు మొత్తం నాసిరకం రైటింగ్ వల్ల వృథా అయ్యాయి. అప్పుడెప్పడో వచ్సిన ఎపిక్ డిజాస్టర్ థగ్స్ అఫ్ హిందుస్థాన్ సినిమాని మించిపోయేలా ఉందీ ఈ కళాఖండం. ఇక సంజయ్ దత్ క్యారెక్టర్ అయితే విపరీతంగా చికాకు పుట్టిస్తుంది. మిథూన్ సంగీతం కొంచెం పర్లేదు కానీ అది కూడా ఏమంత ఉపయోగపడలేదు. అసలు ఇందులో ఏముందని యష్ అధినేతలు ఈ స్క్రిప్ట్ ని ఓకే చేశారో అసలు అర్థం కాదు. కేవలం రన్బీర్ కపూర్ వీరాభిమాని అయితే తప్ప షంషేరా సినిమా ఏ కోణంలోనూ మెప్పించదు.

మరింత సమాచారం తెలుసుకోండి: