ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మహానటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంతటి భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అన్న అంచనాలను ప్రభాస్ అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. 

గత రెండు సినిమాలు గా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతూ ఫ్లాప్ లను తన ఖాతాలో వేసుకుంటున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కన్నుల పండుగగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే భారీ లెవెల్ లో ఈ సినిమా షూటింగ్ ను చేపడుతున్నాడు వందలాది మంది జూనియర్స్ మద్యన ఈ సినిమా యొక్క షూటింగ్ భారీ స్థాయిలో తెరకెక్కుతుంది అని చెప్పాలి. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడవలసిందే. బాలీవుడ్ బాద్షా ఈ సినిమాలో ఓ ముఖ్య అతిధి గా నటిస్తూ ఉండడం విశేషం. 

ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రభాస్ మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు. బాలీవుడ్ లో చేసిన ఆది పురుష్ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రమైన సలార్ కూడా వచ్చే ఏడాది వేసవిలో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయవలసి ఉంది. సందీప్ రెడ్డి దర్శకత్వంలోనూ కూడా ఆయన మరొక సినిమా చేయాలి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలను వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని ప్రభాస్ ఆలోచన ఆ తర్వాత మరికొన్ని భారీ చిత్రాలలో నటించడానికి ఆయన రంగం సిద్ధం చేస్తున్నాడు. మరి ఈ చిత్రాల ద్వారా మంచి విజయాలు సాధిస్తే ప్రభాస్ కు ఎదురు ఉండదు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: