తలపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు.  మొదట ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించి ఆ తర్వాత తెలుగు లో డబ్ చేసి విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో విజయ్ తెలియజేశాడు.

సినిమా తమిళ్ లో 'వరిసు' అనే పేరుతో తెరకెక్కుతుంది. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తుండగా , దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మీక మందన హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.  ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విజయ్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను మూవీ యూనిట్ విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా తెలియజేసింది.

మూవీ ని దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో దర్శకుడు మరియు నటుడు అయిన ఎస్ జే సూర్య కూడా నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే తాజాగా ఎస్ జే సూర్య మానాడు , డాన్ మూవీ లలో ముఖ్యమైన పాత్రలలో నటించి మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: