నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం మోస్ట్ బిజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న వరిసు (వారసుడు) మూవీ లో తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఈ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మూవీ తో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యనిమాల్  సినిమాలో కూడా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రష్మిక మందన ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లాలి కూడా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప ది రైస్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రష్మిక మందన మరి కొన్ని రోజుల్లో పుష్ప ది రూల్  సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నేషనల్  క్రష్ రష్మీక మందన  మరో క్రేజీ తమిళ్ సినిమాలో కూడా అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.  

జ్ఞానవేల్ రాజామూవీ ని నిర్మించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మూవీ యూనిట్ రష్మిక మందన ను సంప్రదించినట్టు తెలుస్తోంది. విక్రమ్ లాంటి గ్రేట్ నటుడి సరసన నటించే అవకాశం రావడంతో రష్మిక మందన వెంటనే ఈ ప్రాజెక్ట్ కి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: