ప్రభాస్ హీరోగా ఇప్పుడు చాలా సినిమాలే సెట్స్ పైన ఉన్నాయి. వాటిలో ఆదిపురుష్ సినిమా మొదటగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నగా ఆ తరువాత సలార్ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలను ఇప్పటికే పూర్తి చేశాడు ప్రభాస్ అవి పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై ఉన్నాయి.

ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ పనులలో ఉన్న ఈ హీరో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అలాగే మారుతి సినిమాలను చేసే విధంగా ముందడుగులు వేస్తున్నాడు వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలను మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు అయితే ఇన్ని పెద్ద భారీ ప్రాజెక్టుల మధ్య మారుతీ లాంటి చిన్న దర్శకుడితో కలిసి చిన్న బడ్జెట్ సినిమా చేయడం నిజంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. 

దానికి తోడు ఆయన గత సినిమా పక్కా కమర్షియల్ భారీ స్థాయిలో ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రానికి కనీస వసూళ్లు కూడా రాబట్టుకోలేకపోయింది. దాంతో ప్రభాస్ అభిమానులు ఎంతగానో టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమా చేయడం అవసరమా అని ప్రభాస్ కు సూచనలు ఇస్తున్నారు. ఇకపోతే మారుతి గతంలో పెద్ద హీరోలతో సినిమాలు చేసిన దాఖలాలు లేవు. మీడియం రేంజ్ హీరోలతో మాత్రమే ఆయన సినిమాలను చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోలు ఏ విధంగా ఆయనను హ్యాండిల్ చేస్తాడు అనేది ఇక్కడ అసలు విషయం. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ హిట్లు కొట్టే ఈ దర్శకుడు భారీ స్థాయిలో మాస్ సినిమా కాకుండా అదే రకమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలో ప్రభాస్ తో చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంతమంది చెబుతున్నారు. అన్ని కుదిరితే ఈ సినిమాను వచ్చే ఏడాది వేసేవిలో మొదలు పెట్టడానికి ప్రభాస్ సిగ్నల్ ఇచ్చేసాడని అంటున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం ని ఆయనకు తీసుకువస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: