మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య.. ఈ సినిమా అభిమానులు మెచ్చే చిత్రంగా పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరుగుతుంది. వీరయ్య పాత్రలో చిరంజీవి ఒక మాస్ హీరోగా కనిపించబోతున్నారు కథ మొత్తం వైజాగ్ వాల్తేర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగా ఎక్కువ భాగం షూటింగ్లో వైజాగ్ లోనే చిత్రీకరించే విధంగా ప్లాన్ చేశారు చిత్ర బృందం. అవసరమైన సన్నివేశాల కోసం రామోజీ ఫిలిమ్ సిటీ లో పలు సెట్లను కూడా నిర్మించారు.


ఇక వీరయ్య గా మెగాస్టార్ చిరంజీవి మాస్ ఆడియన్స్ను మెప్పిస్తాడని ఎంతో నమ్మకంతో ఉన్నారో అభిమానులు. ఇక డైరెక్టర్ కూడా ఈ సినిమాలో చిరంజీవి నటన పీక్స్ లో ఉంటుందని మాట్లాడడం జరిగింది. ఇక చిరంజీవిని అభిమానించే అభిమానిగా ఈ సినిమాని తెరకెక్కించాలని తెలియజేశారు. ఇక చిరంజీవిపై ఎంతటి అభిమానం ఉందో ఈ సినిమాలో కనిపిస్తుంది అని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చారు డైరెక్టర్ బాబి. ఇక ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు  చిరంజీవి మాస్ లుక్ లో కనిపించబోతున్నారు అని చాలా సంబరపడిపోతున్నారు.


అయితే చిరంజీవికి తగ్గట్టుగా ఈ సినిమాలో ఒక మాస్ లేడీ విలన్ గా నటించేందుకు వరలక్ష్మి శరత్ కుమార్ ని దించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం పాత్రకు సంబంధించి పలు చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది ఇదే కనుక నిజమైతే వరలక్ష్మి శరత్ కుమార్ మాస్ పాత్రలో ఒదిగిపోయి నటిస్తుందని చెప్పవచ్చు. ఇక వరలక్ష్మి గతంలో కూడా తెలుగు తమిళ ఆడియన్స్ కు మాస్ పాత్రలలోని బాగా ఆకట్టుకుంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమెకు అంతగా అది అచ్చు రాలేదు కానీ విలన్ గా మాత్రం బాగా అచ్చు వచ్చిందని చెప్పవచ్చు ఇక అందుచేతనే అదే తరహాలో ఉండే పాత్రలను ఎక్కువగా ముగ్గు చూపుతోంది. మరియు వార్త నిజమో కాదా తెలియాలి అంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: