తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో బోనాలు అనేవి జరుగుతాయి. ఇది చివరి వారం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఊళ్ళల్లో కూడా బోనాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మహిళలు ఇంకా యువతులు సంప్రదాయంగా తయారయి బోనం తీసుకొని గుడికి వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బోనాలని నిర్వహించేందుకు అనేక ఏర్పాట్లను చేసింది. చాలా మంది సినీ ఇంకా రాజకీయ తెలంగాణ ప్రముఖులు బోనం సమర్పించి ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బోనమెత్తిన ఫొటో ఒకటి వైరల్ అవుతుంది.అయితే సాయి పల్లవి నిజంగా ఈ బోనం ఎత్తలేదు. చాలా సినిమాల్లో కూడా బోనాల గురించి చూపించారు, ఇంకా పాటలు కూడా పాడించారు. ఇంకా అలాగే ఇటీవల వచ్చిన విరాటపర్వం సినిమాలో కూడా బోనాల గురించి చూపించారు. ఇక ఈ సినిమాని తెలంగాణ ఫ్లేవర్ లో తెరకెక్కించిన డైరెక్టర్ వేణు ఊడుగుల బోనాల సన్నివేశాలను కూడా పెట్టారు.


ఇందులో హీరోయిన్ సాయి పల్లవి లంగా ఓణిలో బోనం ఎత్తుకొని వచ్చే సన్నివేశాలు కూడా ఉన్నాయి.ఇక నేడు తెలంగాణలో బోనాల సందడి ఉండగా డైరెక్టర్ వేణు ఊడుగుల విరాటపర్వం సినిమాలోని సాయి పల్లవి బోనం ఎత్తిన స్టిల్స్ ను షేర్ చేసి.. 'అందరికీ హ్యాపీ బోనం అని చెప్పి ఇంకా గ్రామీణ జీవన సంస్కృతికి, ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!' అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ షేర్ చేశారు. దీంతో సాయి పల్లవి బోనం ఎత్తుకొని ఉన్న ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది కూడా సాయి పల్లవి నిజంగానే బోనం సమర్పించింది అనుకుంటుండగా ఇది విరాటపర్వం సినిమాలోని స్టిల్ అని కామెంట్స్ చేస్తున్నారు సినిమా చూసిన వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: