ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుల్లో అక్కినేని హీరోలు అయిన నాగ చైతన్య ,  అఖిల్ కూడా ఉన్నారు. నాగ చైతన్య ప్రస్తుతం ఎక్కువగా లవ్ స్టోరీ మూవీ లలో నటిస్తూ కెరీర్ ని ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. అలాగే అఖిల్ కూడా వీలుచిక్కినప్పుడల్లా ప్రేమ కథలకు సంబంధించిన మూవీ లలో నటిస్తూనే ,  యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లలో కూడా నటిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా నాగ చైతన్య నటించిన థాంక్యూ మూవీ థియేటర్ లలో విడుదల అయ్యింది. అలాగే మరి కొన్ని రోజుల్లో నాగ చైతన్య హిందీలో నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా కూడా విడుదల కాబోతోంది. ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. ఆ తర్వాత తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఇక అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే నాగ చైతన్య  దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఒక ఫ్యామిలీ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.  ఆ కథను శ్రీకాంత్ అడ్డాల,  నాగార్జున కు వినిపించగా కథలో ఫ్యామిలీ అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ కథ బాగా నచ్చిన నాగార్జున ఆ కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి మల్టీస్టారర్ గా మార్చే అందులో నాగ చైతన్య మరియు అఖిల్ పెట్టి మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిస్తే బాగుంటుంది  అని నాగార్జున , శ్రీకాంత్ అడ్డాల కు సూచించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఆ కథను మల్టీస్టారర్ గా మార్చే పనిలో శ్రీకాంత్ అడ్డాల తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: