టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన పరుశురామ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన యువత సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టిన పరుశురామ్ ఆ తర్వాత ఆంజనేయులు , సోలో , సారొచ్చారు,  శ్రీరస్తు శుభమస్తు,  గీత గోవిందం , సర్కారు వారి పాట వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. గీత గోవిందం మూవీ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పరశురామ్ ఆ తర్వాత నాగ చైతన్య తో ఒక సినిమాను చేయాలి అనుకున్నాడు.

అందుకు సంబంధించి నాగ చైతన్య కు ఓ కథను వివరించగా నాగచైతన్య ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో,  సినిమా కూడా ఓకే అయ్యింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి పరశురామ్ కి మూవీ ఆఫర్ రావడంతో నాగ చైతన్య కూడా అలాంటి స్టార్ హీరోతో ఛాన్స్ రావడం మంచి ఛాన్స్ అని చెప్పడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమాను పరుశురామ్ తెరకెక్కించాడు. 

సినిమా కొంత కాలం క్రితమే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సర్కారు వారి పాట సినిమా పూర్తి అయిన తర్వాత నాగ చైతన్య తో సినిమా చేయాలి అని పరశురామ్ అనుకున్నట్లు,  అందులో భాగంగా మరి కొన్ని రోజుల్లో పరుశురామ్,  నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభం కాబోతున్న వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే నాగచైతన్య ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్ లతో ఫుల్  బిజీగా ఉండడంతో ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. దానితో ప్రస్తుతం పరశురామ్ అల్లు శిరీష్ లేదా వరుణ్ తేజ్ లలో ఒకరితో సినిమా చేయాలని ప్రణాళికలను వేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: