శంకర్ దర్శకత్వంలో
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న
సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆర్ ఆర్ ఆర్
సినిమా తో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చరణ్ ఈ
సినిమా ను పాన్
ఇండియా స్థాయి లో చేస్తుండడం విశేషం. కీయారా అద్వానీ
హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా వచ్చే యడాది
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నహాలు చేస్తుంది. ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు సగ భాగానికి పైగా ఈ
సినిమా యొక్క షూటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ
సినిమా కు సంబంధించిన టీజర్ను కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేసింది.
తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో పలువురు భారీ నటులు నటిస్తూ ఉండడం విశేషం అయితే ఈ
సినిమా కంటే ముందు
శంకర్ తమిళనాడులో ఆపేసిన ఓ సినిమాను మళ్లీ తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు అని అంటున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించిన
భారతీయుడు2 సినిమా షూటింగ్ అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. కారణం ఏదైనా కూడా అంత పెద్ద క్రేజీ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోవడం నిజంగా అందరినీ ఎంతగానో నిరాశపరిచింది.
ఆ సినిమాను అలానే వదిలేసి తన తదుపరి చిత్రాలను చేస్తున్న
శంకర్ ఈ చిత్రాన్ని కమలహాసన్ కోరిక మేరకు తిరిగి మొదలు పెట్టబోతున్నారనే వార్తలు ఇటీవలే వెలబడుతున్నాయి. తాజాగా ఈ సినిమాను చరణ్ సినిమాతో పాటుగా తిరిగి మొదలుపెట్టి పూర్తి చేయబోతున్నారట త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి శింబు కాజల్ ఇద్దరు కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. మరి ఆగిపోయిన ఈ
సినిమా ను మొదలుపెట్టి కమల్ ఎలా విజయాన్ని అందుకున్తాడో చూడాలి. మరోవైపు
విక్రమ్ జోష్ లో ఉన్న కమల్ ఈ
సినిమా ను అదే స్థాయి లో హిట్ చేయాలనీ చూస్తున్నాడు.