తెలుగు
సినిమా పరిశ్రమలో లేడీ విలన్ లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకప్పటి హీరోయిన్లే ఇప్పుడు లేడీ విల్లన్లుగా మారి సినిమాలను చేస్తున్న క్రమంలో రావడమే లేడీ విలన్ పాత్రలో అలరించి ప్రేక్షకులను గుర్తిండి పోయింది
హీరోయిన్ వరలక్ష్మి. తమిళనాడు భారీ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న
హీరో శరత్
కుమార్ తనయరాలిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి. అక్కడ కొన్ని సినిమాలలో
హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
కానీ తనకు ఆ పాత్రలు సరిపడవు అనుకుందో ఏమో వెంటనే ఆమె లేడీ విలన్ పాత్రలు పోసించే విధంగా ముందుకు వెళ్ళింది. అలా ఒకటి రెండు సినిమాలు చేయగానే ఆమె భారీ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. సౌత్ ఇండియాలో ఈ తరహా పాత్రలలో నటించడానికి ఆమె కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తెలుగులో కూడా కొన్ని సినిమాలలో లేడీ విలన్ పాత్రలు పోషించి ఆకట్టుకుంది. తనకు సాటి ఎవరూ లేరని కూడా చాటి చెప్పింది.
ఈ రోజుల్లో ఆమెలా నటించే లేడీ విలన్ లేదనే చెప్పాలి.
ఈ క్రమంలోనే ఆమెకు తాజాగా
మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ విలన్ గా చేసే అవకాశం రావడం ఆమె ఎంతగానో సంతోషపడేలా చేస్తుంది. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ అవకాశం ఉపయోగించుకుని మరొక స్థాయి నటి అనిపించుకోవాలని ఆమె ప్రయత్నాలు చేస్తుంది. త్వరలోనే
చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో ఆమె లేడీ విలన్ గా నటించబోతుంది అన్న అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అని అంటున్నారు
బాబీ దర్శకత్వంలో ఈ
సినిమా యొక్క షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు
మెగాస్టార్ ప్లాన్ చేశాడు. మరి ఈ
సినిమా ద్వారా వరలక్ష్మి ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.