సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు , ఖలేజా మూవీ లు తెరకెక్కాయి.  దాదాపు 11 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించనుండగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నడు. ఈ సినిమా షూటింగ్ ను  ఆగస్ట్ నుండి ప్రారంభించనున్నట్లు , అలాగే వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కథ ఇదే అంటూ నెట్టింట్ లో ఒక కథ తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మహేష్ బాబు ఎన్నారై పాత్రలో కనిపించబోతున్నట్లు ,  అతను ఇండియాకు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమస్యల్లో పాల్గొనబోతున్నట్లు ,  అలా ఒక ఎన్నారై తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ సమస్యల్లో ఏ విధంగా పాల్గొంటాడు అనే కథ చుట్టూ ఈ సినిమా తెరకెక్కనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్బ్,  మహేష్ బాబు కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే సినిమా మహేష్ బాబు కు కెరియర్  పరంగా 28 వ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: