నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు అనే విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించి అతనికి పర్ఫెక్ట్ జోడి అంటూ ఒక పేరు కూడా సంపాదించుకున్నారు. ఇక ఇలా జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో అంకిత కూడా ఒకరు. మూడు సంవత్సరాల వయసులోనే వాణిజ్య ప్రకటనలో నటించింది. మూడేళ్ళ వయసులో రస్నా  యాడ్లో నటించి ఇక ఆ తర్వాత కూడా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది.


 చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాలో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇక తొలి సినిమానే మంచి విజయం సాధించడంతో అంకితకు  తెలుగులో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయ్. ఈ అమ్మడు పట్టిందల్లా బంగారం అయినట్లు చేసిన ప్రతి సినిమా హిట్ కొట్టింది. కాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి సినిమాలో భూమిక హీరోయిన్ అయితే అంకిత సెకండ్ హీరోయిన్ గా నటించింది. తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత కాలంలో వరుసగా సినిమాలు చేసింది. తమిళ్ లో కూడా అవకాశాలు అందుకుని అక్కడ సత్తా చాటింది.


 ఇకపోతే ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీఆర్ సరసన నటించిన అలరించినా హీరోయిన్ అంకిత కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. కెరియర్ పిక్స్ లో  లో ఉన్న సమయంలోనే కథల ఎంపికలో పొరపాటు చేసి చివరికి కెరీర్ని నాశనం చేసుకుంది. పుణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ ను వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది అంకిత. విశాల్, అంకిత  ముంబైలోని పర్లీ లో ఓ హోటల్ లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్బై చెప్పిన ఈ అందాల ముద్దుగుమ్మ తన తండ్రి వజ్రాల వ్యాపారాన్ని చూసుకుంటుందట. ఇటీవలే ఒక  ఇంటర్వ్యూ లో పాల్గొని తన కెరీర్లో సింహాద్రి సినిమా టర్నింగ్ పాయింట్ అంటూ చెప్పుకొచ్చింది ఈ సొగసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: