మెగా స్టార్ చిరంజీవి వివాదాలకు దూరంగా ఉంటాడు. మంచిని ఓపెన్ గా చెప్పాలని చెడును రహస్యంగా చెప్పాలని చిరంజీవి అభిప్రాయ పడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు అతడి అభిప్రాయాలను మార్చుకున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికికారణం చిరంజీవి ‘లాల్ సింగ్ చద్దా’ ప్రమోషన్ ఫంక్షన్ లో అమీర్ ఖాన్ తో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో చిరంజీవి చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యపరిచాయి.


ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో దర్శకులు ఏరోజుకారోజు హీరోలకు ఎదురుగా కూర్చుని డైలాగ్స్ అప్పటికప్పుడు వ్రాసి ఇస్తూ ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని కామెంట్స్ చేసాడు. అంతేకాదు తనలాంటి సీనియర్ హీరోకు కూడ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని దీనివల్ల నటిస్తున్నప్పుడు ఏకాగ్రత లోపించి హీరోలు తమ డైలాగ్స్ ను సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అంటు దర్శకులను టార్గెట్ చేస్తూ చిరంజీవి కామెంట్ చేయడంతో మెగా స్టార్ ఎవర్ని దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేసాడు అంటూ అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి.


వాస్తవానికి చిరంజీవి లేటెస్ట్ గా నటించిన ‘ఆచార్య మూవీ ఫ్లాప్ షాక్ నుండి ఇంకా తెరుకోలేకపోతున్నాడు అంటూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి సెట్స్ పై ఉన్న మూడు భారీ సినిమాలలో నటిస్తున్నాడు. ఈమూడు భారీ సినిమాలకు దర్శకులు మోహన్ రాజా బాబి మెహర్ రమేష్ లు దర్శకత్వం వహిస్తున్నారు.


దర్శకులు వద్ద అలాంటి పరిస్థితి ఎదురైంది అంటూ చిరంజీవి కామెంట్ చేయడాన్ని బట్టి మెగా స్టార్ మనసులో ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా దర్శకులు ఉన్నారా లేదా తనకు ఊహించని ఫ్లాప్ ను ఇచ్చిన కొరటాల శివను దృష్టిలో పెట్టుకుని ఈకామేన్త్స్ చేసి ఉంటాడా అన్న ఊహాగానాలు కూడ ఉన్నాయి. సీనియర్ హీరోలు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లు ఈతరం దర్శకులతో కూడ సద్దుకుపోతుంటే చిరంజీవికి ఇలాంటి అసహనం నేటితరం దర్శకుల పై ఎందుకు ఏర్పడింది అన్నవిషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది..




మరింత సమాచారం తెలుసుకోండి: