మహేష్ హీరోగా
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు నుంచి ఈ
సినిమా యొక్క షూటింగ్ మొదలవుతుంది.
పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో మరో కథనాయక
శ్రీ లీల నటించబోతుంది.
తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అయితే
త్రివిక్రమ్ గతంలో రెండు సినిమాలు చేసిన నేపథ్యంలో ఈ చిత్రం తప్పకుండా మరొక వెరైటీ సినిమాగా వీరి కాంబినేషన్లో మిగిలిపోతుంది అని అంటున్నారు.
అయితే
త్రివిక్రమ్ ఈ
సినిమా కోసం అలాంటి ఇలాంటి పాయింట్ ను టచ్ చేయడం లేదని తెలుస్తుంది. ఒక నార్మల్ కథగా సాగే పిరియాడికల్ ఈ
సినిమా యొక్క కథ అవుతుంది అని అంటున్నారు. ఇది నిజంగా మహేష్ అభిమానులు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అనే చెప్పాలి. మహేష్ బాబు ఇంతవరకు పెరియాడికల్ నేపథ్యంలోని కథ చేయనేలేదని చెప్పాలి. అందరి హీరోలు కూడా ఫ్యాన్
ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా
కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటూ పోతుంటే మహేష్ బాబు మాత్రం కేవలం సౌతకు పరిమితమయ్యే సినిమాలను చేస్తున్నాడు అనే విమర్శ ఉంది.
అలాంటి నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఈ పిరియాడికల్
సినిమా తప్పకుండా పాన్
ఇండియా సినిమా కు లింక్ అయ్యి ఉంది. ఈ నేపథ్యంలో ఈ
సినిమా ఏ స్థాయిలో జరిగే ప్రేక్షకులను అరవిస్తుందో చూడాలి. దర్శకుడు
త్రివిక్రమ్ సత్తా ఏంటో అందరికీ తెలిసిందే. మాటలతోనే అందరిని కట్టిపడేస్తాడు. అలాంటి
త్రివిక్రమ్ చాలా రోజుల తర్వాత తన అభిమాన
హీరో మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాను ఏ స్థాయిలో చేస్తాడో చూడాలి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేసింది. మరి ఈ
సినిమా తర్వాత వీరు ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ప్రేక్షకులలో మాత్రం అంచనాలు వేరే స్థాయి లో ఉన్నాయి.