దర్శకుడు కొరటాల శివ పై అందరికి నమ్మకం పోయినట్లే కనిపిస్తుంది. ఒక్క ఆచార్య సినిమా ఆయనను పూర్తిగా మార్చివేసింది. హీరోల దృష్టి లో ఆయనపై నమ్మకం కోల్పోయేలా చేసింది. సినిమా పోతే పోయింది అనుకుంటే కొరటాలా శివ పరువు ప్రతిష్టలకు కూడా ఈ సినిమా భంగం వాటిల్లేలా చేసింది. ఆ విధంగా కొరటాల శివ ఈ సీనియామా ద్వారా అన్ని విధాలుగా నష్టం వచ్చేలా చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేలా చేస్తున్నారు. ఆ సినిమా నిజంగా కొరటాల శివ కి ఎంతో కీలకమైన సినిమా అని చెప్పాలి. ఆ సినిమా హిట్ అయితేనే అయన కెరీర్ ముందుకు సాగనుంది.

అయన తన తొలి సినిమా నుంచి ప్రేక్షకులను అలరించే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ వంటి హీరోలకు అయన సినిమాలు చేసి వారికీ భారీ విజయాలను చేకూర్చారు. తొలి సారి మెగాస్టార్ తో సినిమా చేయగా అది భారీ ఫ్లాప్ అయ్యింది. ఇన్నాళ్లు అపజయం ఎరుగని దర్శకుడిగా చలామణి అయిన కొరటాల శివ.. ఆచార్యతో భారీ ఫ్లాప్ ను మూటగట్టుకుని డబ్బు పరంగా కూడా భారీగా నష్టపోయాడు. అయితే దీనినుంచి ఎలా కోలుకుంటాడో ఈ హీరో చూడాలి. ఈ సినిమా తర్వాత కూడా పెద్ద హీరోలతో కమిట్ అయ్యాడు కొరటాల శివ.

ఇప్పటికే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న బన్నీ తో అయన ఒక సినిమా చేయాల్సి ఉంది. గతంలోనే ఇది తెరకెక్కవలసి ఉండగా అది కుదరలేదు. అయితే అప్పటికి ఇప్పటికే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కొరటాలతో సినిమా అంటే వెనకడుగు వేస్తున్నాడట అల్లు అర్జున్.మరి వీరందరి నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే కొరటాల శివ ఇప్పుడు చేస్తున్న ఎన్టీఆర్ సినిమా తో తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. తొందరలోనే మొదలుకాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జారుకుంటుంది. వచ్చే ఏడాది వేసవి లో ఈ సినిమా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: