డైరెక్టర్ పూరి జగన్నా థ్ ప్రస్తుతం ముంబైలో తాత్కాలికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత .. లైగర్ సినిమా ప్రకటించినప్పుడు నుంచి ఆ సినిమా పూర్తి అయ్యేవరకు ముంబైలోనే అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. అవసరం మేరకు హైదరాబాదులో కొన్ని షెడ్యూల్స్ లో మాత్రమే వచ్చి తిరిగి మళ్లీ ముంబైకి వెళ్లి పోయినట్లు సమాచారం ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా కోసం పూరి జగన్నా ముంబై స్టూడియోలు ప్రత్యేకంగా సెట్లు సైతం వేశారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడం జరుగుతోంది.


దీంతో పూరి జగన్నాథ్ ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో తన తదుపరి చిత్రాన్ని జనగణమన సినిమాను కూడా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని కూడా రెండు భాషలలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి నిర్మాతగా వంశీ పైడిపల్లి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కూడా ముంబైలో మొదలు పెట్టానున్నారు. లైగర్ సినిమా లో కరణ్ జోహార్ భాగస్వామ్యం ఉండడంతో ముంబైలో పూరి జగన్నాథ్ కచ్చితంగా ఉండవలసి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.


అయితే పూరి జగన్నాథ్ వరుసగా ముంబైలోని షూటింగ్ ప్రారంభించడం వెనుక అసలు కారణమేమిటి హైదరాబాదు నుంచి పూరి జగన్నాథ్ ముంబైలోనే ఉండబోతున్నారా.. అందుకు బలం చేకూర్చే విధంగా పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ఫంక్షన్ కి సైతం డుమ్మా కొట్టి అక్కడే ఉన్నారు. దీంతో పూరి జగన్నాథ్ పూర్తిగా ముంబైకి ముఖం మార్చేశారని సమాచారం.. ముంబైలో సొంతంగా ఒక ప్లాట్ కొనుగోలు చేశారని తనకు కావాల్సినవన్నీ ఆ ఫ్లాట్లోనే సమకూర్చుకున్నట్లుగా సమాచారం. పూరి జగన్నా ఇలా ముంబైలో ప్రైవసీ కోరుకోవడం వెనక పెద్ద ప్లానే ఉందన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలతో సినిమా చేయాలనుకున్న ఆలోచనతోనే ముంబైలో పూరి జగన్నాథ్ ఉన్నట్లుగా సమాచారం. అలా స్క్రిప్ట్ పనుల కోసం ఇప్పుడు విదేశాలకు వెళ్లకుండా ముంబైలోనే రాస్తున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: