అందాల ముద్దు గుమ్మ దిశా పటాని గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి లోఫర్ మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ మూవీ లో దిశా పటాని హాట్ హాట్ అంద చందాలకు , అదిరి పోయే నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

అలా తెలుగు లో నటించిన ఒకే ఒక్క మూవీ తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న దిశా పటాని ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే ఈ ముద్దు గుమ్మకు హిందీ సినిమా నుండి క్రేజీ మూవీ లలో అవకాశాలు దక్కడం, అలాగే ఈ ముద్దు గుమ్మ నటించిన మూవీ లు కూడా ఎక్కువ శాతం బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న దిశా పటాని , ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దిశా పటాని మాట్లాడుతూ... ప్రభాస్ కంటే వినయపూర్వకమైన స్టార్ హీరో ని నేను ఎక్కడా చూడలేదు అంటూ ప్రభాస్ గురించి అద్భుతంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: