నితిన్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం మాచర్ల నియోజక వర్గం. రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల త్వరలోనే జరగనుంది. కాగా చాలా రోజుల తర్వాత నితిన్ ఓ మాస్ సినిమా లో నటిస్తుండడం విశేషం. వరుస ప్రేమకథా చిత్రాలతో అలరిస్తూ నితిన్ ఇప్పటివరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ రెండో ఇన్నింగ్స్ లో నితిన్ మంచి సినిమాలు చేస్తున్నా గత మూడు చిత్రాలుగా అయన ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాడు. హ్యాట్రిక్ ఫ్లాప్ లను అందుకున్న అయన ఈ సారి ఈ సినిమా తో హిట్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ఓ మాస్ పాటకు ప్రేక్షకుల ఫిదా అయ్యారు. సినిమాలోని మాస్ అప్పీల్ ఈ పాటలో తెలుస్తుంది. ప్రేక్షకులలో కూడా సినిమా పట్ల అంచనాలు పెరగడానికి ఇది కారణం అయ్యింది. అంజలి ఈ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వగా ఆమె స్టెప్పులకు అందరు కూడా ఫిదా అయ్యారు. మరి ఈ సినిమా  ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి గురించి ఇప్పుడు అందరు చర్చ జరుపుతున్నారు. వాస్తవానికి మంచి హిట్స్ అందుకున్న కృతి శెట్టి గత సినిమా ది వారియర్ తో ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది.

దాంతో ఆ సినిమా యొక్క ప్రభావం ఈ సినిమా పై పడుతుందా అని అందరు అనుమానాలు చేస్తున్నారు. ఆమె నటించిన తొలి ఫ్లాప్ సినిమా కాబట్టి ఈ చిత్రం పై తప్పకుండా ఆ ప్రభావం ఉంటుంది అని అంటున్నారు. ఏదేమైనా నితిన్ అభిమానులు మాత్రం ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాల్సిందే అంటున్నారు. సినిమా పై ఇప్పటివరకు మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. ఎలాంటి పరిస్థితులలో ఈ సినిమా కు పెద్దగా మైనస్ లు ఉండవు అని చెప్పొచ్చు. మరి నితిన్ ఈ సినిమా ను ఎప్పుడు విడుదల చేస్తాడో చూడాలి. ఈ సినిమా కి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: