2022 జూలై నెలలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్న కొన్ని సినిమాలు విడుదల అయిన విషయం  మన అందరికి తెలిసిందే. అందులో నుండి జూలై 1 వ తేదీన గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.

మంచి అంచనాలతో థియేటర్ లలో విడుదల అయిన పక్కా కమర్షియల్ మూవీ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ మూవీ జూలై 14 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ భారీ యాక్షన్ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మూవీ యూనిట్ ఆశించిన కలెక్షన్లు రాబట్టలేకపోతుంది. ఈ మూవీ లతో పాటు నాగ చైతన్య హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ జూలై 22 వ తేదీన విడుదల అయ్యింది.

సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు కూడా ఈ మూవీ యూనిట్ ఆశించిన కలెక్షన్లు దక్కడం లేదు. ఇలా ఇప్పటి వరకు జూలై నెలలో విడుదల అయిన మంచి క్రేజ్ ఉన్న మూడు తెలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మరి జూలై 29 వ తేదీన రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: