సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరి కొద్ది రోజుల్లో ఒక మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు , ఖలేజా మూవీ లు తెరకెక్కాయి.  దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ క్రేజీ కాంబో లో సినిమా తెరకెక్కుతున్న ఉండడంతో మహేష్ బాబు అభిమానులతో పాటు ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికులు కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇలా ఈ మూవీ పై భారీ అంచనాలు కలిగి ఉండడంతో ఈ మూవీ పై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. అందులో భాగంగా మహేష్ బాబు ఈ మూవీ లో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని  కొన్ని రోజుల క్రితం అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తలు అన్నీ అవాస్తవం అని తెలుస్తోంది. ఈ మూవీ లో మహేష్ బాబు ఎలాంటి డ్యూయల్ రోల్ లో కనిపించడం లేదు అని , ఓకే రోల్ లో  సాదా సీదాగా కనిపించబోతున్నాడు అని సమాచారం.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో వచ్చే నెల అనగా ఆగస్ట్ నుండి మొదలు పెట్టి వచ్చే సంవత్సరం సమ్మర్ కు ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే సినిమా కెరియర్ పరంగా మహేష్ బాబు కు 28 వ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: