రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రభాస్ 'ఆది పురుష్' అనే సినిమాలో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

మూవీ లో ప్రభాస్ కి జోడీగా కృతి సనన్ కనిపించబోతోంది. ప్రభాస్ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనుండగా ,  కృతి సనన్ ఈ మూవీ లో సీత పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుని పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలమే అవుతున్నా ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి  ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు. దానితో ప్రభాస్ అభిమానులు కూడా ఈ మూవీ యూనిట్ పై కూడా కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది పురుష్ మూవీ ఓవర్సీస్ బిజినెస్ కు సంబంధించిన ఆ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఆది పురుష్  సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం కొంత మంది మూవీ బృందాన్ని సంప్రదించిగా , ఆది పురుష మూవీ మేకర్స్ ఈ మూవీ ఓవర్ సీస్  థియేట్రికల్ హక్కుల కోసం 35 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు,  కాకపోతే ఈ సినిమాకు ఇప్పటి వరకు మూవీ మేకర్స్ ఎలాంటి పబ్లిసిటీ చేయకపోవడంతో ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను కొనుగోలు చేయడానికి పంపిణీదారులు అంతగా తొందర పడడం లేదు అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: