విజయ్ దేవరకొండ గురించి మనకి తెలియంది కాదు .అయితే తాజాగా ఆయన నటించిన 'లైగర్' మూవీ ఆగస్టు 25న విడుదల కాబోతుంది. పోతే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది.ఇదిలావుంటే విడుదలకు నెల రోజుల ముందు నుండే ప్రమోషన్లను ఫుల్ స్వింగ్ లో ప్రారంభించారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక ఇందులో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అయితే అక్డీ పక్డీ అనే పాట కూడా ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయ్యి దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేస్తోంది.ఇక దీంతో 'లైగర్' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

 ఇకపోతే  మొదటగా ప్రమోషన్లను ముంబై నుండి మొదలుపెట్టారు. కాగా అక్కడ విజయ్ దేవరకొండ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలావుంటే తాజాగా 'లైగర్' నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షోలో విజయ్ పాల్గొన్నాడు.కాగా  అతనితో పాటు హీరోయిన్ అనన్య పాండే కూడా పాల్గొంది.ఇక ఈ షోలో భాగంగా విజయ్ ను చాలా ఘోరమైన ప్రశ్నలు అడిగాడు కరణ్. పోతే కొన్నిటికి అతను తప్పించుకున్నాడు.అంతేకాదు  మరికొన్ని వాటికి ఇబ్బంది పడ్డాడు. అయితే ఇక  'ఎవరితోనైనా లవ్‌లో ఉన్నావా?' అంటూ కరణ్ అడిగిన ప్రశ్నకు.. విజయ్ సమాధానమిస్తూ.. 'నేను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం గట్టిగా చెప్తాను.

 అంతేకాదు అప్పటివరకు నేను నోరు విప్పి ఎవరి మనోభావాలు కించపరచాలనుకోవట్లేదు. అయితే ఎందుకంటే చాలామంది నటుడిగా నన్ను ప్రేమిస్తారు.ఇక గోడలపై నా పోస్టర్లు అతికిస్తారు.అయితే  ఫోన్‌ వాల్‌పేపర్‌ మీద కూడా నా ఫొటోనే ఉంటుంది. అందుకే  నా ప్రేమ గురించి చెప్పి వారి మనసు ముక్కలు చేయలేను' అంటూ సమాధానమిచ్చాడు విజయ్. ఇదిలావుంటే కొన్నాళ్లుగా విజయ్‌… రష్మిక మందన్నాతో ప్రేమలో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది!అంతేకాదు  ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. అయితే కానీ ఇది ఏంటి అంటే ఫ్రెండ్స్ అంటున్నారు. ఇక ఈ ప్రచారం వీరిద్దరిలో ఒకరికి పెళ్లయ్యే వరకు జరుగుతూనే ఉంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: