బాలీవుడ్ పెద్ద స్టార్ హీరోలలో ఖచ్చితంగా రణబీర్ కపూర్ ఒకరు. ఇక అతడు చివరిగా 'సంజు' అనే సినిమాలో కనిపించారు. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది.ఇక ఆ సినిమా రిజల్ట్ చూసే రణబీర్ కపూర్ తో 'షంషేరా', 'బ్రహ్మాస్త్ర' వంటి సినిమాలను లైన్ లో పెట్టారు దర్శకనిర్మాతలు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన 'షంషేరా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ఈ సినిమాకి కరణ్ మల్హోత్రా దర్శకుడు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది.సినిమాకి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. మీడియాలో కూడా ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఎక్కువగా వచ్చాయి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ రాలేదు. దీంతో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ బాగానే కనిపిస్తోంది.గత శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా ఆదివారం నాటికి మొత్తం రూ.30 కోట్లు రాబట్టింది. ఇక ఆ తరువాత నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.


ఇక పూర్తి రన్ లో ఈ సినిమా మహా అయితే రూ.40 కోట్లకు మించి వసూలు చేయలేదని తెలుస్తోంది.ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాపై పడే ఛాన్స్ ఉంది. రిలీజ్ కు కేవలం 45 రోజుల సమయమే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో బజ్ అనేది రావడం లేదు. ట్రైలర్ లో చూపించిన గ్రాఫిక్స్ మీద చాలా ట్రోల్స్ పడ్డాయి. పైగా ఈ సినిమాను కూడా మూడు భాగాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా ఇంకా రెండో దానిపై ఆసక్తి పోతుంది. ఈ షంషేరా రిజల్ట్ వల్ల సౌత్ ప్రొడ్యూసర్స్ కూడా భయపడుతున్నారు. హిందీ డబ్బింగ్ సినిమాలని రిలీజ్ చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో వున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా రిలీజ్ కావాల్సిన హిందీ డబ్బింగ్ సినిమాలను పునః పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: