నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబీసారా సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ లో దాదాపుగా 43 కోట్లకు పైగా ఈ సినిమా బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. ప్రముఖ నిర్మాత మళ్లీ వశిష్ట సత్యనారాయణ రెడ్డి కుమారుడు వశిష్ఠ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించడం జరుగుతోంది. ఇందులో హీరోయిన్లుగా కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతినేత బింబిసారుడు కథ అంశంగా తెరకెక్కించడం జరిగింది.


సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికి ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన గ్లింప్స్, ట్రైలర్ ,టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. ఇదంతా ఇలా ఉండగా గత కొద్ది రోజుల నుండి ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త చాలా పాపులర్ గా మారుతోంది. బింబీసార కథ కళ్యాణ్ రామ్ కంటే ముందుగా రవితేజ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. రవితేజకు కథ నచ్చకపోవడంతో ఈ సినిమా రిజెక్ట్ చేశాడని ఆపైన కళ్యాణ్ రామ్ దగ్గరకు ఈ ప్రాజెక్టు వల్ల ఈ సినిమా తెరకెక్కించారని వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే  అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ వశిష్ఠ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంలో ఎలాంటి నిజమో లేదు కళ్యాణ్ రామ్ గారినే ఊహించుకోని బింబిసారా సినిమాను సిద్ధం చేశాను నా దగ్గర మొదటి నుంచి చిన్న ఐడియా ఉండేది దాన్ని కళ్యాణ్ రామ్ గారితో షేర్ చేసుకోగా ఆయన వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అప్పుడు పూర్తి కథను సిద్ధం చేశానని తెలిపారు.. ఒకవేళ కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా నో  చెప్పి ఉంటే బింబి సారా సినిమా ఉండేది కాదని తెలిపారు డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: