టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం ఈ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. నితిన్ మొట్ట మొదటి సారి తన కెరియర్ లో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలో నటించాడు. అలాగే నితిన్ ఈ సినిమాలో కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో సముద్ర ఖని ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా ,  ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి, కేథరిన్ లు ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించగా , మహతి స్వర సాగర్మూవీ కి సంగీతాన్ని అందించాడు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి లు ఈ మూవీ ని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పాటలను , కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి  ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా జూలై 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకులలో ఒకరు గా కొనసాగుతున్న అనిల్ రావిపూడి విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  ఈ సినిమా ట్రైలర్ ను 07:43 కు మూవీ యూనిట్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: