ప్రభాస్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా ఆది పురుష్. ప్రేక్షకులను సంక్రాంతికి అలరించడానికి సిద్ధమవుతుంది. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  రామాయణం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతూ ఉండగా రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే సీతగా కృతీసనన్ అలరించబోతుంది. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నాడు. ఆ విధంగా ఎన్నో ప్రత్యేకతల నడుమ రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతుంది.

దానికి తోడు ప్రభాస్ నటించిన గత రెండు సినిమా లు పూర్తిస్థాయిలో అలరించని నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా తప్పకుండా భారీ విజయం అందుకోవాల్సిన నేపథ్యంలో విడుదలవుతున్న సినిమా కాబట్టి ఈ చిత్రం పై ఇంతటి అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా యొక్క అప్డేట్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు చేయాలని వారు నిర్ణయించారు. ఈ క్రమంలో అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యొక్క అప్డేట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా యొక్క టీజర్ ను ఆ రోజున విడుదల చేసే ఆలోచనలు చేస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన సలార్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న ఈ సినిమా యొక్క షూటింగ్ జరగకుండా జరుపుకుంటుంది. అది పురుష్ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రెండు పనులను చూసుకుంటూ ప్రభాస్ ఎంతో బిజీగా గడుపుతున్నాడు. మరొకవైపు ప్రాజెక్టుకే సినిమాలో కూడా ఆయన నటిస్తూ ఉండడం విశేషం. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమాను వచ్చే ఏడాది మొదలు పెట్టబోతున్నారు. ఇన్ని భారీ సినిమాలను చేస్తున్న ప్రభాస్ వాటి విడుదల తర్వాత ఎంతటి విజయాలను అందుకుంటాడో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: