టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారాలపై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు.ఇక మహేష్ బాబు అతి త్వరలో రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. కాగా ఈ ఏడాది మహేష్ బాబు మేజర్ సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.ఇకపోతే హైదరాబాద్ లోని పాపులర్ రెస్టారెంట్లలో ఒకటైన మినర్వాతో కలిసి లగ్జరీ రెస్టారెంట్ ను మొదలుపెట్టాలని మహేష్ బాబు ఆలోచన అని తెలుస్తోంది.

కాగా  బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. పోతే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక్కొక్కరు సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని వేర్వేరు రంగాలలో పెట్టుబడులుగా పెడుతున్నారు.అంతేకాదు కొంతమంది హీరోలు రియల్ ఎస్టేట్ పై దృష్టి పెడుతుంటే మరి కొందరు హీరోలు మాత్రం పొలాలను కొనుగోలు చేస్తున్నారు.ఇదిలావుంటే  ప్రస్తుతం లక్షల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో సులువుగా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం అయితే ఉంటుందని హీరోలు భావిస్తుండటం గమనార్హం.కాగా కొంతమంది హీరోలు,

హీరోయిన్లు కమర్షియల్ కాంప్లెక్స్ లపై దృష్టి పెడుతూ భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు.అయితే మరి మహేష్ బాబు రెస్టారెంట్ బిజినెస్ లో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ఇదిలావుంటే మరోవైపు ఆగష్టు నుంచి మహేష్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. పోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.అయితే  మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక మహేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: