రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు
శివ నిర్వాణ దర్శకత్వంలో
ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే ఇంకొక వైపు జేజిఎమ్
సినిమా యొక్క షూటింగ్ పనులను చూసుకుంటున్నాడు. అదే సమయంలో లైగర్
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొంటున్నాడు. ఆ విధంగా రౌడీ స్టార్ ఈ మూడు సినిమాలతో ఈ ఏడాది, వచ్చే ఏడాది ఫుల్ బిజీ కాబోతున్నాడు. ఆయన నటించిన లైగర్
సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు.
డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతున్న
ఖుషీ పట్ల అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆ తరువాత జనగణమన
సినిమా షూటింగ్ లో పాల్గొనే ఈ
హీరో ఆగస్టు 3వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు. త్వరలోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ లో పూర్తిస్థాయిలో పాల్గొనబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఆయన చేయబోయే తదుపరి సినిమాలు ఏంటి అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
త్రివిక్రమ్ కొరటాల
శివ వంటి దర్శకులు లైన్లో ఉన్నా కూడా వారిని పట్టించుకోకపోవడం నిజంగా
విజయ్ దేవరకొండ అభిమానులను కొంత కలవరపరుస్తుంది.
సినిమా పరిశ్రమలో వారు అగ్ర దర్శకులుగా ఉన్నారు అలాంటి దర్శకులతో సినిమాలు చేస్తే మంచి విజయాలు అందుతాయి కానీ వారిని పక్కన పెట్టి ఎవరితో సినిమాలో చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. వారిద్దరు కూడా
విజయ్ దేవరకొండ ఫ్రీ అయ్యే టైంలో వారు అవైలబుల్ ఉంటారో లేదో తెలియదు. ఇంకొక వైపు
సుకుమార్ దర్శకత్వంలో కూడా ఆయన
సినిమా చేయవలసి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే రాగా ఈ చిత్రం తప్పకుండా వచ్చే ఏడాది ఆగస్టులో మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటికే పుష్ప సినిమాను మొదలుపెట్టి దాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని
సుకుమార్ భావిస్తున్నాడు. మరి అన్ని కుదిరితే ఈ
సినిమా వచ్చే ఏడాది మొదలవుతుందని అనుకోవచ్చు.