టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ కెరీర్ గురించి మనకి తెలిసిందే. అయితే ఈయన కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో కార్తికేయ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.అయితే  నిఖిల్ చందూ మొండేటి కాంబినేషన్ లో కార్తికేయ తర్వాత కిర్రాక్ పార్టీ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన కార్తికేయ2 సినిమా వచ్చే నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఇదిలావుంటే మొదట ప్రకటించిన రిలీజ్ డేట్ ప్రకారం జులై 22వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. 

ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ఇక  ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ రావడంతో నిఖిల్ అభిమానులు సంతోషిస్తున్నారు.కాగా  సెన్సార్ సభ్యులు కార్తికేయ2 సినిమాలో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు కార్తికేయ2 కాన్సెప్ట్ ఆలోచనను రేకెత్తించే విధంగా ఉందని సెన్సార్ సభ్యులు వెల్లడించారు.ఇదిలావుంటే సెన్సార్ సభ్యులు ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెప్పడంతో నిఖిల్ అభిమానులు సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

పోతే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించారు.అయితే  అటు నిఖిల్ కు ఇటు అనుపమకు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. పోతే ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే చందూ మొండేటికి సైతం కొత్త ఆఫర్లు వస్తాయని చెప్పవచ్చు.ఇదిలావుంటే ఈ సినిమాకు పోటీగా థియేటర్లలో మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదలవుతోంది. అయితే కార్తికేయ2 సినిమా 30 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: