టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీసిందో మనకు తెలిసిందే కదా. పలు సినిమాలలో జంటగా నటించిన వీరిద్దరూ నిజజీవితంలో కూడా రిలేషన్ లో ఉన్నారని స్వయంగా ఈ జంట ఒప్పుకున్నారు కూడా.


ఈ క్రమంలోనే వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఇక వీరిద్దరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లడంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.ఇలా నరేష్ పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు రావడంతో సీన్లోకి రమ్య రఘుపతి కూడా ఎంట్రీ ఇచ్చారు.


ఈ విధంగా వీరి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరగడమే కాకుండా ఏకంగా రమ్య రఘుపతి నరేష్ పవిత్ర పై చెప్పుతో దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. ఇలా వీరిద్దరి సహజీవనం గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో కొద్దిరోజుల పాటు నరేష్ పవిత్ర వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


 


ఇకపోతే ఈ సినిమాలో మరోసారి పవిత్ర నరేష్ కూడా సందడి చేశారు. అయితే ఈసారి వీరిద్దరూ భార్యాభర్తలుగా కాకుండా అన్నా చెల్లెలుగా సందడి చేయడం విశేషం. ఇలా పవిత్ర నరేష్ ఇద్దరు అన్నా చెల్లెలుగా ఈ సినిమాలో కనిపించడంతో ఒక్కసారిగా థియేటర్లో పెద్ద ఎత్తున విజిల్స్ మోత మోగిపోయిందట.. ఇన్ని రోజుల పాటు వార్తల్లో సహజీవనం ప్రేమ పెళ్లి అంటూ సంచలనంగా మారిన ఈ జంటను ఈ సినిమాలో అన్నాచెల్లెళ్లుగా చూపించడంతో ఒక్కసారిగా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందట.


 


ఈ క్రమంలోనే వీరి పాత్రలపై పలువురు నేటిజన్ లు స్పందిస్తూ డైరెక్టర్ శరత్ పై సెటైర్లు కూడా పేలుస్తున్నారు. వీరిద్దరినీ అన్నా చెల్లెలుగా ఎలా చూపించాలని అనిపించింది శరత్ అంటూ పెద్ద ఎత్తున డైరెక్టర్ పై సెటైర్స్ కూడా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: