నందమూరి ఫ్యామిలీ అంటేనే ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు బాగా తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి నందమూరి అభిమానులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు.


ఎన్టీఆర్ అభిమానులు గాను బాలయ్య అభిమానులుగా విడిపోయారు.ఇలా నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ గొప్పలు చెప్పుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. నందమూరి తారక రామారావు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ హరికృష్ణ ఇండస్ట్రీలో రాణించారు.


అనంతరం హరికృష్ణ వారసులుగా కళ్యాణ్ రామ్, తారక్ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ విధంగా నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎన్టీఆర్ ను నారా కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎదగకుండా కొందరు కుట్ర పడ్డారనే వార్తలు ఇప్పటికీ ఇండస్ట్రీలో వినపడుతుంటాయి. ఈ విధంగా నారా కుటుంబంతో కలిసిన బాలకృష్ణ ఫ్యామిలీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ క్రమంలోనే తాత స్థాపించిన పార్టీ తరపున గతంలో ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పటికీ కూడా ఈయనకు పార్టీ నుంచి ఏ విధమైనటువంటి ప్రాతినిథ్యం అయితే దొరకడం లేదు.


 


అందుకే పూర్తిగా రాజకీయాలకు దూరమైన ఎన్టీఆర్ సినిమాలపై తన దృష్టి పెట్టారు.ఇకపోతే గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో కొందరు ఎన్టీఆర్ రంగంలోకి దిగితేనే పార్టీ నిలదొక్కుకుంటుందని పెద్ద ఎత్తున ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కూడా ఆశపడ్డారు. ఇలాంటి రాజకీయాల కారణంగా బాలకృష్ణ ఎన్టీఆర్ మద్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయని గత కొద్ది రోజులుగా వార్తలు కూడా వినపడుతూనే ఉన్నాయి.


 


అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు గురించి ఎక్కడ బయటపడలేదు అలాగే ఎవరూ కూడా ప్రస్తావించలేదు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ఈవెంట్ లో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని బయటపడిందట.. ఈ కార్యక్రమానికి తారక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ వేదిక పైన తన అన్నయ్య గురించి తన తాత గురించి ప్రస్తావించిన ఎక్కడా కూడా బాలకృష్ణ పేరు ప్రస్తావించకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ఈ సందర్భంగా మరోసారి బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: