2019వ సంవత్సరంలో మీటు ఉద్యమం స్ఫూర్తితో ప్రముఖ యాక్టర్ నానాపటేకర్ పై పలు ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది హీరోయిన్ తనూ శ్రీ దత్త.. తనని ఆయన చాలా వేధించారని అనంతరం అతడి పై పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిపించింది. పది సంవత్సరాల క్రితం నాటి సంఘటన ప్రస్తావిస్తూ.. తనూ శ్రీ ఈ ఆరోపణలు చేయడం జరిగింది. చివరికి చాలా రోజులపాటు సాగిన ఈ విచారణ అనంతరం నానాపటేకర్ నిర్దోషిగా బయటకు రావడం జరిగింది ఈ తీర్పు పై పలుసార్లు సోషల్ మీడియాలో ఎన్నో విషయాలను పంచుకుంది తనూ శ్రీ దత్త.. ఇదంతా ఇలా ఉండగా తనూ శ్రీ సడన్గా ఇచ్చిన స్టేట్మెంట్ తో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.


తనకి ఏదైనా జరిగితే నానా పటేకర్ బాలీవుడ్ మాఫియా అందుకు బాధ్యత వహించాలని తనూ శ్రీ దత్త తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టును తెలియజేసింది. నానాపటేకర్ అతని బాలీవుడ్ మాఫియా స్నేహితులు తనని చిత్రహింసలకు గురి చేశారని ఇలాంటివి ఎక్కడ జరగకూడదని తనూ శ్రీ దత్త తన ఇంస్టాగ్రామ్ నుంచి పోస్ట్ చేసింది. పరిశ్రమలో మీటు ఆరోపణలను మళ్లీ తిరిగి లేపుతూ నానా పటేకర్ తోపాటు సినీ వర్గానికి చెందిన మరి కొంతమంది కూడా తనని ధాంగికంగా వేధించారని ఈమె ఆరోపణ చేస్తోంది.తాజాగా మరొకసారి బాలీవుడ్ చెందిన కొందరు తనని వేధిస్తున్నారని తనని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని ఏమైనా సోషల్ మీడియాలో వరుస సందేశాలను షేర్ చేస్తూ ఉన్నది. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో కూడా వారి ప్రమేయం ఉందని తెలియజేసింది.. మరింత వివరంగా తనూ శ్రీ తన నోట్ ని పరిశీలిస్తే ఈ సారాంశం మనకు అర్థమవుతుంది. ఇక నానా పటేల్ అతని లాయర్లు సహా అనుచరులు అతని బాలీవుడ్ మాఫియా తనకు ఏదైనా జరిగితే బాధ్యత వహించాలని తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: