ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫిదా సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఇచ్చి తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఫిదా చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక గ్లామర్ షో కి పోకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతోంది.  కోట్ల రూపాయలు వస్తాయి అని ఆలోచించకుండా తనకు సంతృప్తినిచ్చిన పాత్రలు చేస్తే సరిపోతుంది అని భావిస్తోంది సాయి పల్లవి. అందుకే సాయి పల్లవి అంటే అటు అభిమానుల్లో కూడా ఎనలేని గౌరవం పెరిగిపోయింది అని చెప్పాలి.


 ఇటీవలి కాలంలో అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సాయి పల్లవి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అంతేకాదు సాయిపల్లవి ఒక లేడి పవర్ స్టార్ అంటూ అభిమానులు పిలవడం కూడా మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం సాయి పల్లవి కి బ్యాడ్ టైం నడుస్తుంది. అన్నది అర్థమౌతుంది.. ఎందుకంటే ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. మొన్నటికి మొన్న సాయిపల్లవి ప్రధాన పాత్రలో వచ్చిన విరాట పర్వం సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి చివరికి ప్రేక్షకులను నిరాశ పరిచింది.


 ఇటీవలే లేడీ ఓరియెంటెడ్ గా సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన గార్గి సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఇలా వరుసగా ఫ్లాపులు రావడానికి సాయి పల్లవి కథల ఎంపికలో చేస్తున్న తప్పులు అని తెలుస్తోంది. అయితే ఈ అమ్మడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిన కమర్షియల్గా నిర్మాతలకు హిట్టు లేకపోతుంది. ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో మారాలని సాయిపల్లవి సలహా ఇచ్చారట నిర్మాతలు. అయితే ఆఫర్ రాకపోతే క్లినిక్ అయిన పెట్టుకుంటాను లేదా జాబ్ చేసుకుంట కానీ నా వాల్యూ తగ్గించుకుని ఇష్టం లేని సినిమాల్లో నటించను అంటూ చెప్పిందట సాయి పల్లవి. ఈ లెక్కన చూసుకుంటే సాయి పల్లవి కెరీర్ క్లోజ్ అయినట్లే అంటూ ఒక టాక్ తెరమీదికి వచ్చింది. మరి ఏం జరుగుతుంది  అన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: